వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉన్నత చదువులు చదివినా సరైన ఉద్యోగం లేకపోవటం, స్వగ్రామంలో వ్యవసాయం చేస్తే పెళ్లి కుదరకపోవటంతో మనస్థాపం చెంది ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువకుడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.