Farmers Stops Farming Focus On Sheeps Business: ఏపీలో అక్కడ రైతులు వ్యవసాయానికి స్వస్తి చెబుతున్నారు. కొత్త బిజినెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. వారంతా పొట్టేళ్ల పెంపకం వైపు ఫోకస్ పెట్టారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తుండటంతో యువత కూడా ఆసక్తి చూపుతోంది. పంట నష్టాలతో విసిగిపోయిన రైతులు, నిరుద్యోగులు ఈ ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తున్నారు. మూడు నెలల్లోనే మంచి ఆదాయం వస్తుండటంతో వేలాది కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. నెల్లూరు నుంచి కూడా అనుభవజ్ఞులు ఇక్కడకు వస్తున్నారు.