శంషాబాద్ విమానాశ్రయం భద్రత దృష్ట్యా 10 కి.మీ పరిధిలో డ్రోన్లు, పారాగ్లైడర్లపై నిషేధం విధించినట్లు సీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఈ ఆంక్షలు జూన్ 9 వరకు అమల్లో ఉంటాయి. హైదరాబాద్ నుండి సరిహద్దు ప్రాంతాల విమానాలను ఎయిర్ ఇండియా, ఇండిగో రద్దు చేశాయి. టికెట్లు కొన్నవారికి డబ్బు తిరిగిస్తారు. కాల్పుల విరమణ తర్వాత కూడా భద్రత కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఢిల్లీ నుండి వచ్చే ప్రయాణికుల సంఖ్య పెరిగింది.