హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 15.20% వృద్ధితో 2.13 కోట్ల మంది ప్రయాణికులను చేరవేసి రికార్డు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా ప్రయాణికులు వస్తుండటంతో రద్దీ పెరిగింది. దుబాయ్, దోహా, అబుదాబి వంటి నగరాలకు ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు.