హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ను విస్తరించాలని (జీహెచ్ఐఎల్) యోచిస్తోంది. ప్రయాణికుల.. విమానాల రాకపోకలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రూ.14,000 కోట్లతో విస్తరణ పనులు చేపట్టాలని భావిస్తుండగా.. దీనిలో కొత్త టెర్మినల్, రన్వే నిర్మిస్తారు. వచ్చే ఏడాది ప్రారంభమై.. 2029 కల్లా పనులు పూర్తి అవుతాయి. 2008లో ప్రారంభమైన ఈ విమానాశ్రయం భారతదేశంలో అత్యంత రద్దీగా ఉన్న వాటిలో ఒకటిగా నిలిచింది. ఇది హైదరాబాద్ ఆర్థిక వృద్ధికి, ఉద్యోగ కల్పనకు దోహదపడుతుంది.