తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఈ నెలాఖరున రిటైర్ కానున్నారు. ఆమె స్థానంలో సీనియర్ ఐఏఎస్ కె. రామకృష్ణారావు సీఎస్ బాధ్యతలు చేపడతారు. రిటైర్ అయిన వెంటనే శాంతి కుమారిని MCHRD వైస్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.