దక్షిణ మధ్య రైల్వే రెండు ముఖ్యమైన రైళ్ల రూట్లను మార్చింది. సికింద్రాబాద్ స్టేషన్ నుండి వెళ్లే ఈ రైళ్లు ఇకపై కాచిగూడ, చర్లపల్లి స్టేషన్ల నుండి రాకపోకలు సాగిస్తాయి. శాతవాహన ఎక్స్ప్రెస్ రైలును ఈ నెల 15 నుండి, సికింద్రాబాద్-సిల్చార్ ఎక్స్ప్రెస్ రైలును ఈ నెల 9, 12 తేదీల నుండి మారుస్తున్నారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.