Srisailam Toll Gates Fees Free: శ్రీశైలం ఆలయంలో ఈనెల 19 నుంచి మార్చి 1వరకు బ్రహ్మోత్సవాలతో పాటు మహాశివరాత్రి పండుగను వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఈనెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. 24 నుంచి 27 వరకు భక్తులందరికీ ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇస్తారని.. 25, 26 తేదీల్లో రద్దీ దృష్ట్యా టోల్ వసూళ్లను నిలిపివేస్తున్నారు.