హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ఢిల్లీ, ముంబయి వంటి నగరాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తున్నా.. దక్షిణాది మెట్రో నగరాల్లో భాగ్యనగరం పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. తాజాగా, ఐఐటీ కాన్పూర్ చేపట్టిన అధ్యయనంలో షాకింగ్ వాస్తవాలు బయటపడ్డాయి. ఐదు చోట్ల కాలుష్య తీవ్రతను మ్యాప్ చేయగా.. నగరంలో కంటే శివారులోనే అత్యధికంగా ఉద్ఘారాలు వెలువడుతున్నట్టు ఈ అధ్యయనం గుర్తించింది. ఓఆర్ఆర్ వద్ద రోజుకు వేల కిలోల సల్ఫర్ విడుదలవుతోంది.