అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. శుభకార్యానికి హాజరైన యువకులు ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో ఈ దుర్ఘటన జరిగింది. గల్లంతైన వారి కోసం పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.