తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కోసం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది. అధికారులు తయారుచేసిన జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత, ఆన్లైన్లో కృత్రిమ మేధస్సు ద్వారా మరింత లోతుగా విశ్లేషిస్తున్నారు. అనర్హులను గుర్తించి, అర్హులైన వారికి మే 10లోగా ప్రొసీడింగ్లు జారీ చేసి, ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల అర్హుల జాబితాలను ఆయా గ్రామాల్లో ప్రదర్శించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.