కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదిలాబాద్ జిల్లాలో రూ. 3,900 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఆదిలాబాద్ ఆదివాసీల పోరాటాలకు ప్రతీక అని ఆయన కొనియాడారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రాల మధ్య అనుసంధానం పెంచేందుకు కీలకమైన ప్రాజెక్టులు చేపడుతున్నామని, హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.