దక్షిణ మధ్య రైల్వే భారీ శుభవార్త చెప్పింది. ఈ నెల 21వ తేదీన స్పెషల్ టూరిస్ట్ రైలు ప్రారంభం అవుతుందని పేర్కొంది. సప్త జ్యోతిర్లింగ దర్శనం కోసం ఈ స్పెషల్ ట్రైన్ నడిపిస్తున్నట్లు ఐఆర్సీటీసీ జనరల్ మేనేజర్ కిషోర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ యాత్ర సికింద్రాబాద్లో మొదలయి.. కాజీపేట జంక్షన్ మీదుగా సాగుతుంది. మొత్తం తొమ్మిది రోజులు, ఎనిమిది రాత్రులు ఈ ప్రయాణం సాగుతోంది. ఈ ప్రయాణంలో భక్తులు ఆధ్యాత్మిక అనుభూమతిని పొందవచ్చు.