ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కంటే.. ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అయితే పాఠశాలలో జాయిన్ చేయించే ముందు ఆ పాఠశాల ఎలాంటిది.. అక్కడ ఎలాంటి క్వాలిటీ చదువు చెబుతున్నారు అనే వివరాలను చాలా మంది తల్లిదండ్రులు తెలుసుకోరు. ఇంటి నుంచి పిల్లల్ని బడికి పంపించామా.. సాయంత్రం వెళ్లి తీసుకొచ్చామా అన్నట్లే ఉంటారు. తీరా చూస్తే అక్కడ పాఠశాలకు అనుమతులు ఉండవు. ఇలాంటి ఘటన ఒకటి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.