తుపానులు, భారీ వర్షాలు వచ్చిన సమయంలో తీర ప్రాంత ప్రజలు పడే ఇబ్బందులు అన్నీ, ఇన్ని కావు. ఈదురు గాలులు, సముద్రం మీద నుంచి వచ్చే గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకూ 150 కిలోమీటర్ల మేరకు తీరం వెంట తాటిచెట్లు పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలోని సముద్ర తీరంలో పనులు మొదలయ్యాయి.