Falaknuma Express Train Detached: శ్రీకాకుళం జిల్లాలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం నుంచి తప్పించుకుంది. పలాస సమీపంలో రైలు నుంచి బోగీలు విడిపోయాయి. సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.. రైల్వే సిబ్బంది వెంటనే మరమ్మతులు చేపట్టారు. గత వారం విజయనగరం జిల్లాలో నాగావళి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది.. అయితే అప్పుడు కూడా పెను ప్రమాదం తప్పింది. వరుసగా రెండు ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగించింది.