శ్రీరామనవమి సందర్భంగా రేపు హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. 12 గంటల పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని.. పోలీసులు వెల్లడించారు. అయితే వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలకు అనుగుణంగా తాము ప్రయాణించే మార్గాలను మార్చుకోవాలని హితవు పలికారు.