తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. శ్రీవాణి ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో టీటీడీ మార్పులు చేసింది. భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని మార్పు చేసింది. దీంతో ఇకపై శ్రీవాణి ట్రస్టుకు పదివేల రూపాయలు విరాళమిచ్చే సమయంలో.. వీఐపీ బ్రేక్ దర్శనం కోసం అదనంగా మరో 500 రూపాయలు కలిపి.. మొత్తం రూ.10,500 ఒకేసారి చెల్లించవచ్చు. ఈ మేరకు శుక్రవారం నుంచి మార్పులు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.