శ్రీవాణి దర్శనం టికెట్లకు సంబంధించి శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి చేసింది. శ్రీవాణి దర్శనం టికెట్లకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని కోరింది. హ్యాకింగ్కు తావులేకుండా శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్ విధానాన్ని పటిష్టపరిచామన్న టీటీడీ.. కొంతమంది ఏఐ సాయంతో బుకింగ్కు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. అలాంటి ప్రయత్నాలను టీటీడీ టెక్నికల్ టీమ్ ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నట్లు తెలిపింది. నకిలీ టికెట్లు విక్రయించేవారిపైనా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.