టీటీడీ పేరుతో నకిలీ వెబ్సైట్లు రూపొందించి.. భక్తులను బురిడీ కొట్టించి.. భారీగా డబ్బులు దండుకుంటున్నారని.. అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే శ్రీవారి భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు. ఫేక్ వెబ్సైట్ల ద్వారా శ్రీవారి దర్శనాలు, తిరుమలలో గదులు ఇప్పిస్తామంటూ.. భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన టీటీడీ.. చర్యలు చేపట్టింది. ఫేక్ లింక్లు, వెబ్సైట్లపై కాపీరైట్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.