తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఈవో శ్యామలరావు గుడ్ న్యూస్ చెప్పారు. శ్రీవారి మెట్టు నడక మార్గంలో టీటీడీ ఈవో శ్యామలరావు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. శ్రీవారి దివ్యదర్శనం టోకెన్ల జారీలో భక్తులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. శ్యామలరావు తనిఖీలు నిర్వహించారు. శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు ఇబ్బందులు తప్పేలా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే తిరుపతి నుంచి శ్రీవారి మెట్టుకు భక్తుల సంఖ్యను పెంచే అంశాన్ని పరిశీలిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.