శ్రీశైలంలో 60 ఏళ్లుగా పాగాలంకరణ సేవలో పాల్గొన్న పృథ్వీ వెంకటేశ్వర్లకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రకాశం జిల్లా హస్తినాపురం వాసి అయిన వెంకటేశ్వర్ల కుటుంబం మూడు తరాలుగా ఈ సేవలో కొనసాగుతోంది. మహాశివరాత్రికి ముందు రోజు ఆయన దిగంబరుడిగా మారి పాగాలంకరణ సేవ చేసేవారు. ఆయన సేవలను గుర్తించి మార్తాండ్ సింగ్ అవార్డును ప్రకటించారు. అయితే అవార్డు వచ్చేలోపే ఆయన మరణించారు. చనిపోయిన తర్వాత ఆయన సేవలకు గుర్తింపు లభించింది.