Srisailam Temple Hundi Theft Issue: శ్రీశైలం మల్లన్న ఆలయంలో హుండీ చోరీకి ప్రయత్నం జరగడం కలకలం రేపింది. నలుగురు బాలురు హుండీని పగలగొట్టి కానుకలు దొంగిలించడానికి ప్రయత్నించగా, ఆలయ అధికారులు ఇద్దరిని పట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్థానికేతరులైన ఒక వ్యక్తి, మహిళ ఈ దొంగతనానికి పథకం వేసినట్లు గుర్తించారు. ఆలయ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.