Srisailam Hundi Income: శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు కానుకల రూపంలో భారీగా ఆదాయం సమర్పించారు. హుండీల ద్వారా కోట్ల రూపాయల నగదు, బంగారు, వెండి ఆభరణాలు లభించాయి. అంతేకాదు వివిధ దేశాల కరెన్సీ కూడా వచ్చి చేరింది. శ్రీశైలంలో పలువురు భక్తుల కోరిక మేరకు స్పర్శ దర్శనం వేళలను మార్చారు. ఇకపై మధ్యాహ్నం కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు అని తెలిపారు. ఈ మార్పు భక్తులకు మరింత చేరువయ్యేలా చేస్తుంది.