Srisailam Devotee Makara Torana: శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడానికి నిత్యం వేలమంది భక్తులు వస్తుంటారు.. భక్తులు మల్లన్నకు కానుకల్ని, విరాళాలను అందిస్తుంటారు. కొందరు కానుకల్ని నేరుగా ఆలయానికి, మరికొందరు విరాళాల్ని, ఇంకొదరు హుండీల్లో కానుల్ని చెల్లిస్తుంటారు. తాజాగా మరో భక్తుడు మల్లన్న ఆలయానికి ఖరీదైన కానుకను అందజేశారు. బంగారుపూత కలిగిన మకర తోరణాన్ని అందజేశారు. అలాగే తెనాలికి చెందిన భక్తుడు వెండి అఖండ దీపపు సెమ్మెను శ్రీశైలం ఆలయానికి ఇచ్చారు.