శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. ఆ హోటల్ వెబ్‌సైట్‌ను అస్సలు నమ్మొద్దు..

3 months ago 21
సైబర్ నేరగాళ్లు శ్రీశైలం హరిత హోటల్ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించారు. ఈ నకిలీ వెబ్‌సైట్‌ను నమ్మి బెంగళూరుకు చెందిన ఓ పర్యాటకుడు రూ. 15,950 మోసపోయాడు. సైబర్ మోసగాళ్లు ఇచ్చిన ఫేక్ రశీదుతో హోటల్‌కు వెళ్లగా.. సిబ్బంది అది నకిలీది అని చెప్పారు. దీంతో కంగుతున్న పర్యాటకుడు హోటల్ మేనేజర్‌ను కలిశాడు. అయితే ఈ ఫేక్‌ వెబ్‌సైట్‌పై శ్రీశైలం పోలీసులకు ఫిబ్రవరిలోనే ఫిర్యాదు చేసినట్లు మేనేజర్ చెప్పారు. భక్తులు, పర్యాటకులు.. అధికారిక వెబ్‌సైట్‌లోనే హోటల్ బుకింగ్ చేసుకోవాలని.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article