Srisailam Temple Upgrades Pilgrim Amenities: శ్రీశైలంలో భక్తుల సౌకర్యార్థం తిరుమల తరహాలో మార్పులు చేయాలని పాలకమండలి నిర్ణయించింది. సెలవు దినాల్లో స్పర్శ దర్శనాన్ని రెండు విడతలుగా పరిమితం చేశారు. పబ్లిక్ అమినిటీస్ కాంప్లెక్స్లు, బీవోటీ పద్ధతిలో టాయిలెట్స్, స్నానపు గదుల నిర్మాణం, గర్భాలయంలో రుద్రాక్ష మండపానికి బంగారు తాపడం వంటి 39 అంశాలకు ఆమోదం లభించింది. ఈ మేరకు పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే చెంచులకు ఉచిత దర్శనం కల్పిస్తున్నారు.