శ్రీశైలంలో మద్యం, సారా విక్రయాలు.. బస్సులలో తెచ్చి అమ్ముతున్న మహిళలు

1 week ago 4
పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అక్రమంగా మద్యం, నాటుసారా విక్రయిస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సుల ద్వారా మద్యం, నాటుసారాను అక్రమంగా తీసుకువచ్చి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ఐదుగురు మహిళలను అరెస్ట్ చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన ఐదుగురు మహిళలు శ్రీశైలానికి ఆర్టీసీ బస్సులలో అక్రమంగా మద్యం, నాటుసారా తీసుకువచ్చి.. ఆర్టీసీ బస్టాండ్, మాణిక్యమ్మపెల్ల, సిద్ధ రామప్ప కాంప్లెక్స్ ప్రాంతాల సమీపంలో విక్రయిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఐదుగురు మహిళలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు.. వారి వద్ద నుంచి 314 క్వార్టర్ బాటిళ్లు, 24 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు.
Read Entire Article