SHAR Authorities Receive Terror Alert Call: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ సెంటర్కు బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేగింది. తమిళనాడు కంట్రోల్ సెంటర్కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి షార్లో బాంబులు పెట్టారని, ఉగ్రవాదులున్నారని చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి విస్తృత తనిఖీలు చేపట్టారు. అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు. చివరికి అది నిజమైన బెదిరింపు కాదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.