రిటైర్డ్ టీచర్ నన్నేషా హుస్సేన్కు విద్యుత్ శాఖ వారు ఊహించని షాక్ ఇచ్చారు. ఏకంగా 15 లక్షలకు పైగా కరెంట్ బిల్లు రావడంతో ఆయన దిమ్మతిరిగింది. ప్రతి నెల వెయ్యి రూపాయలు వచ్చే బిల్లు.. ఒక్కసారిగా లక్షల్లోకి ఎలా పెరిగిందో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. డిజిటల్ మీటర్లు వచ్చాకే బిల్లులు పెరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కోనసీమ జిల్లాలో జరిగింది. అధికారులు స్పందించి న్యాయం చేస్తారో లేదో చూడాలి.