SCR To Run 11 More Special Trains For Sankranti: సంక్రాంతి పండగ వేళ రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. రద్దీని తగ్గించేందుకు అదనంగా 11 ప్రత్యేక రైళ్లను నడపనుంది. జనవరి 7 నుంచి 12 వరకు కాకినాడ, వికారాబాద్, పార్వతీపురం, సికింద్రాబాద్ మధ్య ఈ రైళ్లు తిరుగుతాయి. విశాఖపట్నం-చర్లపల్లి, అనకాపల్లి-వికారాబాద్ మార్గాల్లో కూడా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. టికెట్ బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.