సంగారెడ్డిలో ఘోర విషాదం నెలకొంది. విధుల్లో ఉన్న ఏఎస్ఐపైకి పోలీస్ వాహనం దూసుకెళ్లింది. దీంతో ఆ ఏఎస్సై తీవ్రంగా గాయాలపాలయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. అయితే ఆ పోలీస్ వాహనాన్ని ఓ హోంగార్డు డ్రైవ్ చేయగా.. ఈ ఘటన తర్వాత అతడు పరారైనట్లు పోలీసులు తెలిపారు. దీంతో పరారీలో ఉన్న హోంగార్డును పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.