తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో నకిలీ హాజరు వ్యవహారం కలకలం రేపుతోంది. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా హాజరు నమోదులో అవకతవకలు జరిగాయని గుర్తించారు. ముఖ్యమంత్రి ఫోటోను కూడా వాడి అటెండెన్స్ వేసిన ఘటనలు వెలుగులోకి రావడంతో మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇలా నకిలీ హాజరు నమోదు చేసిన 533 మంది పంచాయతీ కార్యదర్శులను గుర్తించారు. విచారణ అనంతరం వీరికి నోటీసులు అందజేస్తున్నారు. ఈక్రమంలో ఓ జిల్లాలో అధికంగా 82 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ వివరాలు..