సచివాలయ ఉద్యోగుల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులను బదిలీ చేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వదంతులు నమ్మవద్దని, బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని ఆర్డీ విశ్వనాథ్ తెలిపారు. అర్హత ప్రకారమే బదిలీలు ఉంటాయని, ఎవరికీ డబ్బులు ఇవ్వద్దని సూచించారు. సొంత మండలంలో పోస్టింగ్ ఉండదనే నిబంధనతో పొరుగు మండలాలకు బదిలీ చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..