తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన ఖరారైంది. శ్రీరామనవమి సందర్భంగా.. కుటుంబ సమేతంగా భద్రాద్రి రామయ్యను దర్శించుకోనున్న రేవంత్ రెడ్డి.. సీఎం హోదాలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు కూడా ఉండనున్నారు. అనంతరం.. భద్రాచలం నియోజకవర్గంలో ఒక సామాన్యుని ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి.. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యంతో వండిన భోజనాన్ని ఆరగించనున్నారు.