సనాతన ధర్మ పరిరక్షకా ఎక్కడ? తిరుమలలో స్వామీజీ ఆమరణ దీక్ష

3 hours ago 1
తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్వామీజీలు ఆందోళనకు దిగారు. వెంటనే దీనిని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్షకు దిగడం సంచలనంగా మారింది. అలిపిరి శ్రీవారి పాదాల వద్ద ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు స్థలం కేటాయించడంతో నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని, నిర్మాణం నిలిపివేయాలని శ్రీనివాసానంద సరస్వతిస్వామి ఆధ్వర్యంలో స్వాములు నిరాహార దీక్ష చేపట్టారు. టీటీడీ పరిపాలన భవనం ముందు స్వాములు దీక్షకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది... ‘తిరుమల ఏడుకొండలు రక్షించుకుందాం.. సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ ఎక్కడ’..అంటూ ఫ్లకార్డులను వారు ప్రదర్శించారు. శ్రీనివాసానంద స్వామి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై విమర్శలు గుప్పించారు. తిరుమల ప్రక్షాళణపై వల్లే వేసే చంద్రబాబు, సనాతన ధర్మ పరిరక్షణ..ఆలయాల సందర్శన అంటూ హడావుడి చేస్తున్న పవన్‌లకు ఏ మాత్రం హిందూ ధర్మ పరిక్షణ పట్ల, తిరుమల పవిత్రత పట్ల చిత్తశుద్ధి ఉన్నాఈ నిర్మాణం నిలిపివేయించాలని డిమాండ్ చేశారు.
Read Entire Article