రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, సమ్మెలు చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డి కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు. సంస్థను కాపాడుకునే బాధ్యత ఉద్యోగులపై ఉందని, సమ్మెకు దూరంగా ఉండి సహకరించాలని ఆయన కోరారు. కార్మికుల సహకారంతోనే ప్రభుత్వం ఏర్పడిందని, వారి సంక్షేమం కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ప్రజల సూచనల మేరకు రాష్ట్రాన్ని నడుపుతానని తెలిపారు. కార్మికుల శ్రమ ఎప్పుడూ వృథా కాదు.. మీకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.