తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు గురువారం ప్రారంభమయ్యాయి. మే 26 వరకు జరిగే ఈ పుష్కరాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తెలంగాణ, ఏపీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక.. తొలి సారి సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 35 కోట్లతో ఏర్పాట్లు చేసింది. విజయవాడ నుండి కాళేశ్వరం వరకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, ప్యాకేజీలను ప్రకటించింది.