భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమై అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ ప్రజల కోసం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ.. అవసరమైన సహాయం చేసేందుకు సిద్దమైంది.