ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 210 పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించనుంది. అయితే, ఇది కేవలం యూకేజీ విద్యార్థుల కోసమేనని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఒక్కో పాఠశాలలో 30 మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఈ నిర్ణయం ఆలస్యంగా తీసుకున్నారని, ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించిన తల్లిదండ్రులకు ఇది ఉపయోగపడదని కొందరు అభిప్రాయపడుతున్నారు.