తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించాలని ప్రతిపాదిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను ప్రభుత్వానికి సమర్పించింది. రిజర్వేషన్ల అడ్డంకి తొలగడంతో, సీఎస్, డీజీపీలతో ఎస్ఈసీ సమావేశం అనంతరం నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.