తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 10న జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో సమావేశం ప్రారంభమవుతుంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, రైతు సంక్షేమం వంటి అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, రాజీవ్ యువవికాసం, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై కూడా సమీక్షించనున్నారు.