తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది. వికారాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి సర్పంచ్, రెండు వార్డు సభ్యుల పదవులు దక్కే అరుదైన సంఘటన చోటుచేసుకుంది. రిజర్వేషన్ల కారణంగా భీమప్ప కుటుంబానికి ఈ అదృష్టం వరించింది. కాగా, నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.