ఎట్టకేలకు తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. తమ పార్టీ బలపరిచే సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే.. ఆ గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా రూ. 10 లక్షల ప్రోత్సాహక నిధులు ఇస్తానని ప్రకటించారు. తాను మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదని.. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు ఇవ్వడంలో విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే కాబట్టి.. బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.