గద్వాల ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, ప్రధాన నిందితుడు తిరుమలరావు మధ్య ఐదేళ్లుగా అక్రమ సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారని.. అనుమానం రాకుండా తిరుమలరావు వాయిస్ ఛేంజర్ ఉపయోగించి ఆడ గొంతుతో మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. ఐశ్వర్య ప్రేరణతోనే తిరుమలరావు సుపారీ గ్యాంగ్తో కలిసి తేజేశ్వర్ను దారుణంగా హత్య చేశాడని విచారణలో తేలింది.