తెలంగాణలో రైతులను యూరియా కొరత వేధిస్తోంది. రోజుల తరబడి కేంద్రాల చుట్టూ తిరిగినప్పటికీ ఒక్క బస్తా అయినా దొరకడం కష్టంగా ఉంది. యూరియా ఇస్తారనే వార్త తెలిసిన వెంటనే సహకార సంఘాల కేంద్రాల వద్దకు వెళ్లి అర్ధరాత్రి నుంచే క్యూలైన్లో నిలబడుతున్నారు. ఈ క్రమంలో చెప్పులు, పాసు పుస్తకాలను కూడా క్యూలైన్లో ఉంచుతున్నారు. తాజాగా, మాజీ మంత్రి యూరియా కోసం క్యూలైన్లో సాధారణ రైతు మాదిరిగా నిలబడి.. తన పేరు రాయించుకున్నారు.