TG Tenth Results: 2025 పదో తరగతి ఫలితాల్లో మహబూబాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. గతంలో ఎప్పుడూ దరిదాపుల్లో కూడా లేదు. గత రెండేళ్లు అత్యధిక ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన నిర్మల్ జిల్లా మాత్రం కిందకు పడిపోయింది. అయితే, కాస్త అటూ ఇటూ అవ్వొచ్చు కానీ, మరీ ఇంతటి వ్యత్యాసం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదట. కాకపోతే పోయినసారి నిర్మల్ జిల్లా విద్యాశాఖాధికారి, ఈసారి మహబూబాబాద్ డీఈఓ ఒక్కరే. కారణం ఏమై ఉండొచ్చని ఆ సారును అడిగితే.. ప్రత్యేక ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇంతటి విజయాన్ని సాధించినట్టు చెప్తున్నారు.