Chandrababu Naidu Five Days Singapore Tour: రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ బృందం సింగపూర్ ప్రభుత్వంతో పట్టణ ప్రణాళిక, నగర సుందరీకరణపై చర్చిస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో 13 సంస్థలకు 65.89 ఎకరాల భూమిని కేటాయించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల కోసం 432 అపార్ట్మెంట్ల నిర్మాణానికి రూ.524.70 కోట్లు కూడా విడుదల చేసింది.