సింగరేణి కార్మికులకు డబుల్ బొనాంజా లభించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.1,95,610 బోనస్తో పాటుగా.. కేంద్ర ప్రభుత్వం దీపావళి సందర్భంగా సింగరేణి కార్మికులకు రూ.1,03,000 పీఎల్ఆర్ఎస్ బోనస్ను ప్రకటించింది. సుమారు 41 వేల మంది సింగరేణి కార్మికులకు వర్తించే ఈ బోనస్ గత సంవత్సరం కంటే రూ.9,250 ఎక్కువగా ఉంది. ఈ బోనస్ దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గని కార్మికులకు వర్తిస్తుంది. గని కార్మికులకు ఇంత పెద్ద మొత్తంలో బోనస్ అందడం ఇదే తొలిసారి.