సింగరేణి సంస్థ ఒక విప్లవాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. సంస్థ చరిత్రలోనే తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. కేవలం 7వ తరగతి పాస్ అయిన మహిళలకు.. భారీ యంత్రాలను నడిపే ఆపరేటర్లుగా నియమించేందుకు అప్లికేషన్లను స్వీకరిస్తోంది. ప్రస్తుతం సింగరేణి సంస్థలో జనరల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న మహిళలకు.. ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లోని ఆపరేటర్లుగా పనిచేసేందుకు అవకాశం కల్పించింది. అయితే దీనికి సంబంధించిన అర్హతలను, వివరాలను సింగరేణి సంస్థ తాజాగా విడుదల చేసింది.